పదేళ్ల చిన్నారి అంటే.. అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ.. నాన్నతో కలిసి షికారుకు వెళ్తూ హాయిగా గడిపే కాలం. లోకంలో కష్టాలు, బాధలు ఉంటాయి అనే విషయం తెలియకుండా ఎంతో ఆనందంగా.. ఆడుతూ, పాడుతూ బాల్యాన్ని గడిపేస్తారు. వారికి సంబంధించిన ప్రతి పనిని తల్లే చేస్తుంది. వారిని నిద్ర లేపి.. రెడీ చేసి స్కూల్కి పంపడం వరకు అన్ని తల్లి బాధ్యతలే. అయితే అందరు చిన్నారులకు ఈ అవకాశం ఉండదు.
తల్లిదండ్రులు ఇద్దరు కష్టజీవులే అయితే.. ఆ పిల్లలు తమను తాను చూసుకోవడమే కాక.. తమ చెళ్లెల్లు, తమ్ముళ్ల బాధ్యతలను కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ పదేళ్ల బాలికకు. తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయదారులు కావడంతో.. తన చెల్లిని చూసుకుంటూనే చదువుకుంటుంది. తరగతి గదిలో చెల్లెలిని ఎత్తుకుని పాఠాలు వింటోంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: దేశంలో అత్యాచారాలకు ఫోన్లే కారణం.. మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు!
వివరాల్లోకి వెళ్తే.. మణిపుర్లోని తామెంగ్లాంగ్ జిల్లాకు చెందిన10 ఏళ్ల బాలిక మీనింగ్సిన్లియు పమీ.. తన చెల్లితో పాటు పాఠశాలకు హాజరవుతోంది. సోదరి ఆలనాపాలనా చూసుకుంటూనే పాఠాలు వింటోంది. చెల్లెలిని ఎత్తుకుని ఉన్న ఫొటో ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తోంగమ్ బిశ్వజిత్ సింగ్ వద్దకు చేరింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర భాజపా నేతలను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో షేర్ చేశారు మంత్రి.
Her dedication for education is what left me amazed!
This 10-year-old girl named Meiningsinliu Pamei from Tamenglong, Manipur attends school babysitting her sister, as her parents were out for farming & studies while keeping her younger sister in her lap. pic.twitter.com/OUIwQ6fUQR
— Th.Biswajit Singh (@BiswajitThongam) April 2, 2022
“చదువుపట్ల చిన్నారికి ఉన్న అంకితభావం నన్ను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఈ వార్త విన్నవెంటనే వారి కుటుంబాన్ని గుర్తించి ఆ చిన్నారిని ఇంపాల్కు తీసుకురావాలని తెలిపాం. బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు తన బాధ్యత మేం తీసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాను. ఆమె అంకితభావానికి గర్వపడుతున్నాను’’ అని మణిపుర్ వ్యవసాయ శాఖ మంత్రి అని తోంగమ్ బిశ్వజిత్ సింగ్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి!