కిలో 25 రూపాయిల నుండి అమాంతం రూ. 150 వరకు కూడా ధర వెళ్లిపోతుంటడంతో వంటిల్లు బోసిపోయింది. కూరల్లో టమాటా లేక కర్రీలన్నీ చప్పగా మారిపోయాయి. ఏ కూరగాయలు లేకపోయినా.. కేవలం టమాటాలతో కర్రీ లేదా టమాటా బాత్ అయినా చేసి చెప్పి పిల్లలకు, భర్తకు లంచ్ చేసే మహిళలకు
ఇప్పుడు దేశ మంతా ఒకటే రచ్చ.. అదే టమాటా ధరలు పెరిగిపోయాయని. కిలో 25 రూపాయిల నుండి అమాంతం రూ. 150 వరకు కూడా ధర వెళ్లిపోతుంటడంతో వంటిల్లు బోసిపోయింది. కూరల్లో టమాటా లేక కర్రీలన్నీ చప్పగా మారిపోయాయి. ఏ కూరగాయలు లేకపోయినా.. కేవలం టమాటాలతో కర్రీ లేదా టమాటా బాత్ అయినా చేసి పిల్లలకు, భర్తకు లంచ్ ప్రిపేర్ చేసే ఆడవాళ్లకు.. వీటి ధరలు మరింత బెంబేలు ఎక్కిస్తున్నాయి. అదేవిధంగా టమాటా ధరలు పెరగడంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వంటి సెలబ్రిటీలు సైతం స్పందించారు. టమాటా ధర పెరగడంతో తాను కూడా వాటిని తక్కువగా తింటున్నానని అన్నారు. అలాగే ఈ ధరలపై వచ్చినన్నీ మీమ్స్ నెవ్వర్ బిఫోర్. అయితే ఈ టమాటా ఓ ఇంట్లో కాక రేపింది. ఏకంగా భార్య భర్తలను విడిదీసింది.
ఆకాశన్నంటుతున్న ఈ ఎర్రటి టమాటా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని షాహ దోల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సంజీవన్ బర్మన్ టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. అతడికి చేదోడు వాదోడుగా ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు. హాయిగా సాగిపోతున్న వీరి కాపురంపై టమాటా ధరల పెరుగుదల ప్రభావం చూపించాయి. అయితే ఇటీవల వంట చేస్తుండగా.. భార్యకు తెలియకుండా భర్త రెండు టమాటాలు వాడేశాడు. అంతే అది తెలిసిన భార్య అతడిపై కస్సుబుస్సులాడింది. నన్ను అడగకుండా నిన్నెవ్వరూ టమాటాలు వాడమన్నారంటూ అంతెత్తున అతడిపై ఎగిరింది. ఈ టమాటాల విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. భర్తపై అలిగి మూడు రోజుల పాటు అతడితో మాట్లాడలేదు
ఇక అతడితో జీవితం వద్దనుకుని భార్య.. పిల్లలను తీసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయిందని. భార్య కనిపించకపోవడంతో సంజీవన్ భర్త వెతికినా కనిపించలేదు. తెలిసిన బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని అడగ్గా .. అక్కడకు రాలేదన్న సమాచారమే అందింది. దీంతో భయపడ్డ భర్త పోలీసులను ఆశ్రయించాడు. టమాటాల విషయంలో గొడవై భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్యా, బిడ్డల్ని వెతికి తెస్తామని అతడికి హామీనిచ్చారు. టమాటా అతడి కాపురంలో చిచ్చు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.