అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎంత కష్టపడినా చాలీచాలని జీవితాలను గడపాల్సి వస్తుంది. కొంత మందికి అనుకోకుండా అన్నీ కలిసి వస్తాయి.. మరికొంత మందికిడ కాస్త ఆలస్యం అయినా అదృష్ట లక్ష్మి తప్పకుండా తలుపు తడుతుంది. ఓ వ్యాపారికి దాదాపు 20 ఏళ్ల తర్వాత వజ్రం రూపంలో అదృష్టం కలిసి వచ్చింది.
ఇది చదవండి: రైలు నుండి జారి పడిన మహిళ.. దేవుడిలా వచ్చిన పోలీస్ అన్న!
మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో సుశీల్ శుక్లా కుటుంబం ఇటుకల బట్టీని నడుపుతోంది. ఈ బట్టీ కోసం మట్టిని కృష్ణ కళ్యాణ్పూర్ ఏరియా నుంచి మట్టిని సేకరిస్తుంటుంది ఈ కుటుంబం. సోమవారం గని తవ్వకాల నుంచి బయటపడిన 26.11 క్యారెట్ల వజ్రం విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని వేలం వేసి, విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని మినహాయించుకుని.. మిగిలినది ఇస్తామని అధికారులు ప్రకటించారు. శుక్లా ఫ్యామిలీ వజ్రాల కోసం 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా లాభం లేకుండా పోయిందట. దీంతో నిస్సారమైన ఆ ప్రాంతాన్ని ఇటుకల తయారీకి మైన్ రూపంలో మట్టి కోసం లీజుకు తీసుకుంది.
ఇది చదవండి: ఆ కుటుంబంపై పగపట్టిన పాము! ఒక్కరిని వదలకుండా!
ఈ క్రమంలోనే గని తవ్వకాల నుంచి బయటపడిన 26.11 క్యారెట్ల వజ్రం లభించడంతో ఆనందంలో మునిగిపోయారు. తన కుటుంబం 20 ఏళ్ల నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నా, ఇంత పెద్ద వజ్రాన్ని ఏ రోజూ చూడలేదని శుక్లా తెలిపాడు. మరో ఐదుగురు భాగస్వాములతో కలసి చేస్తున్న మైనింగ్ ఎట్టకేలకు అతడి కష్టానికి తగ్గ ఫలితాన్నిచ్చింది. 20 ఏళ్ల నాటి కల ఇప్పుడు ఇలా నెరవేరడంతో శుక్లా కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నది. తన బిజినెస్ను పెంచుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెబుతున్నాడు శుక్లా. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.