అధికారులు అంటే ప్రజలపై కఠినంగా వ్యవహరిస్తారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. ప్రజలకు ఏమైన జరిగితే వారి మనస్సు కరగదని, కేవలం వారి కుటుంబ సభ్యుల విషయంలోనే వారి మనస్సు చలిస్తుందని మరికొందరు అభిప్రాయ పడుతుంటారు. కానీ సమాజంలో జరిగే హృదయ విదారక ఘటనలపై కూడా అధికారుల మనస్సు చలిస్తోంది. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారిని చూసి ఓ ఐఏఎస్ అధికారిని కంటతడిపెట్టుకున్నారు. రోడ్డు యాక్సిడెంట్ బాధితులను చూసి ఆస్పత్రిలోనే కళ్లు ఎర్రబడేలా ఏడ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లఖీంపూర్ పరిధిలోని దౌరాహా నుంచి లక్నోకు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఐరా వంతెన మీద ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మంది మరణించారు. మరో 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన కుటుంబాలకు పీఎం జాతీయ సహాయ నిధి కింద రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థికసాయం అందించనుంది. అయితే ప్రమాదం గాయపడి ఆస్పత్రికి చికిత్స పొందుతున్న బాధితులను లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ పరామర్శించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతన్న ఓ బాలుడిని చూసి రోషన్ జాకబ్ కన్నీరు పెట్టుకున్నారు. గాయపడ్డ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారందరికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె ఆదేశించారు. ఆమె కొన్ని గంటల పాటు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని గమనించారు. అయితే రోషన్ జాకబ్ బోరున కన్నీరు పెట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
#WATCH |Lakhimpur Kheri bus-truck collision: Lucknow Divisional Commissioner Dr Roshan Jacob breaks down as she interacts with a mother at a hospital&sees condition of her injured child
At least 7 people died&25 hospitalised in the accident; 14 of the injured referred to Lucknow pic.twitter.com/EGBDXrZy2C
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022