అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.. కానీ అదృష్టం ఒక్కసారి వరిస్తే మాత్రం ఒక్కసారిగా మన జీవితం మారిపోతుంది. అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే కోట్లాది మంది ఆశావహుల తపన కూడా ఆ లాటరీ కోసమే.
ఒక్కసారైనా అదృష్టం కలిసి రాదా.. తమ బతుకులు మారకపోతాయా అనుకుంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అదృష్ట లక్ష్మి ఎప్పుడో ఓ సారి అలాంటి తలుపు తడుతుంది. అలా జాక్ పాట్ తగిలిన వారు.. లక్షాధికారి, కోటీశ్వరులు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ బాలికకు అలాంటి అదృష్టం వరించింది. వివరాల్లోకి వెళితే..
జమాల్ సింగ్ అనే వ్యక్తి అమృత్ సర్ లో చిన్న తోపుడు బండిపై వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతని కుమార్తె చదువుకుంటూ అప్పుడప్పుడు తండ్రికి సహాయంగా వస్తుంటుంది. ఆదివారం స్కూల్ కి సెలవు కావడంతో తండ్రితో వచ్చిన హర్ సిమ్రాన్ కౌర్ లాటరీ అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి వందరూపాయలు పెట్టి ఒక లాటరీ కొన్నది. డబ్బులు ఎందుకు వృధా చేస్తావని జమాల్ సింగ్ తన కూతురుని మందలించాడు.
అదృష్ట లక్ష్మి జమాల్ సింగ్ కూతురు కొన్న లాటరీ రూపంలో తలుపు తట్టింది. వీరు కొన్ని లాటరీకి బుధవారం ఏకంగా పది లక్షలు తగిలింది. ఈ విషయం మొదట జమాల్ సింగ్ అస్సలు నమ్మలేదు.. కానీ అందరూ ఆ నెంబర్ చూపించడంతో తన కూతురు అదృష్ట దేవత అంటూ ఎగిరి గంతేశాడు. తాము గెల్చుకున్న డబ్బును వ్యాపారాభివృద్ది, పిల్ల చదువు కోసం వినియోగిస్తానని జమాల్ తెలిపాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Bengaluru: ఫేస్ బుక్ పేరుతో బేకరి షాప్.. వ్యాపారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు!