అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలో చిరుతపులి హల్ చల్ చేస్తుంది. ఎదురుపడ్డ మనుషులపై వరుస దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎఫ్ఆర్ఐ) వద్ద ఉండే స్థానికులు, ఫారెస్ట్ సిబ్బంది మీద దాడి చేసింది. జోర్హాట్ పట్టణం అడవులతో చుట్టిముట్టి ఉండడంతో.. చిరుత పులి ఆ అడవుల నుంచి క్యాంపస్ లోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. చిరుతపులికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చిరుత సంచరిస్తున్న విజువల్స్, అలానే ఎటాక్ చేసిన విజువల్స్ రికార్డ్ కనబడుతున్నాయి. ఒక వీడియోలో వ్యాన్ లో ఉన్న వ్యక్తుల మీద చిరుతపులి పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేసినట్టు విజువల్స్ లో కనబడుతోంది.
ఒక ఇంటి లోపల నుంచి గేట్లు మూసి ఉన్నా కూడా ఫెన్సింగ్ పై నుంచి దూకి మరీ బయటకు వచ్చింది. వ్యాన్ మీదకు దూకగా.. విఫలవ్వడంతో అక్కడ నుంచి ఒక రోడ్డు మీదుగా ముందుకు వెళ్ళిపోయింది. చిరుతని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులను ఇళ్ళలోంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ముగ్గురు ఫారెస్ట్ సిబ్బంది సహా 13 మంది వ్యక్తులపై చిరుత పులి దాడి చేసింది. 13 మందికి గాయాలు అవ్వగా.. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని, వారి పరిస్థితి బాగానే ఉందని జోర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు. గాయమైన వారిలో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
చిరుత ఫుడ్ కోసం వెతుక్కుంటూ ఇలా క్యాంపస్ లోకి వచ్చి ఉండవచ్చునని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. జీప్ లో వెళ్తున్న ఫారెస్ట్ సిబ్బందిపై, అలానే సాధారణ వ్యక్తులు వెళ్తున్న ఒక వ్యాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. వేరే వీడియోలో చిరుత ఒక ఇంట్లో మెట్ల కింద ఉన్నట్లు కనబడుతోంది. చిరుత తరచూ స్థానాలను మారుస్తూ.. చీకటి పడగానే పక్క గ్రామానికి వెళ్ళిపోతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చిరుత దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరుత ఇలా అడవులు దాటి ఇలా నివాస ప్రాంతాలకు రావడానికి గల కారణం ఏమిటి? అడవులను ఆక్రమించిన మనుషుల లోపమా? లేక వాటికి తిండి దొరకకపోవడమే పాపమా? ఈ సమస్యకు కారణమేంటో, అలానే పరిష్కారం ఏమిటో కామెంట్ చేయండి.
#WATCH | Assam: 13 persons including three forest staff were injured after being attacked by a leopard in Jorhat. All injured persons were immediately admitted to a local hospital. All the injured persons are out of danger: Mohan Lal Meena, SP, Jorhat (26.12) pic.twitter.com/TQ92Z248NR
— ANI (@ANI) December 27, 2022