అక్షరాస్యత, సాంకేతిక విజ్ఞనంలో ఎంత ముందుకు వెళ్తున్న కొన్ని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలను పాటించడంలో జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మరీ ముఖ్యంగా చనిపోయిన వారు తిరిగి బతుకుతారనే ఆశతో.. కొందరు చేసే పనులు చూస్తే.. ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలుగుతుంది. కొన్ని రోజుల క్రితం బళ్లారిలో ఓ చనిపోయిన బాలుడిని బతికించడం కోసం ఉప్పులో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరోకటి వెలుగు చూసింది. రీల్స్ చేస్తూ.. యువతి మృతి చెందింది. ఈ క్రమంలో సదరు యువతి బతుకుతుందనే ఆశతో ఉప్పులో పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన కర్ణాటక, చిక్కబళ్లాపుర జిల్లా, శిడ్లఘట్ట తాలుకాలోని గాజులవారిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అమృత.. ఎంఏ చదువుతోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటుంది. తరచుగా రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా అమృత.. గంగానహళ్లిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువు దగ్గరకు వెళ్లింది అమృత.
అక్కడ సరదాగా రీల్స్ చేస్తూ.. ఉండగా.. అనుకోకుండా చెరువులో జారిపడింది. కాపాడమని కేకలు వేసింది. సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న వారు అమృత కేకలు విని.. చెరువు దగ్గరకు వచ్చి చూడగా.. ఆమె అప్పటికే నీటిలో ముగినిపోయింది. ఆలస్యం చేయకుండా చెరువులో దిగి.. అమృతను బయటకు తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. అయితే ఉప్పులో ఉంచితే అమృత బతుకుందనే నమ్మకంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె మృతదేహాన్ని ఉప్పులో ఉంచారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి వచ్చి అమృత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టానికి తరలించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయయండి.