ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో.. సోషల్ మీడియా బేస్ చేసుకొని వెలుగులోకి వస్తున్న ఔత్సాహిక కళాకారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎవరి సహాయం లేకున్నా సొంత టాలెంట్ తో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. టాలెంట్, అవకాశం రెండింటినీ సరిగ్గా ఉపయోంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందో.. ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న ‘కచ్చా బాదాం‘ పాట చూస్తే తెలుస్తుంది.
దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఈ పాట సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుంది. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధి వ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజ్ తీసుకొచ్చారు కొందరు యూట్యూబర్స్. ఈ పాటకి దక్కిన ఆదరణతో ఆ పల్లీల వ్యాపారి భూభన్ జీవితమే మారిపోయింది. దేశవ్యాప్తంగా కచ్చా బాదమ్ పాట రీల్స్ కి డిమాండ్ పెరిగింది.ఇక కచ్చా బాదాం పాట డీజే వెర్షన్ కూడా 50 మిలియన్ల పైగా వ్యూస్ రాబట్టుకోవడం విశేషం. కానీ ఇంతలోనే ఈ వైరల్ సింగర్ కు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో భూబన్ ఛాతిలో బలమైన గాయం కారణంగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం భూబన్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, భూబన్ కు స్టార్ డమ్ రావడంతో సెకండ్ హాండ్ లో ఒక కారు తీసుకున్నాడు. అయితే భూబన్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే భూబన్ కు ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే తన సొంతగా ఓ పాట అల్లుకొని వీధుల్లో పాడుతూ తన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఆ పాట ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్స్టా రీల్స్తో కచ్చా బాదాం ఫేమస్ అయ్యింది. మరి కచ్చా బాదాం పాట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.