కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రజాశాంతి పార్టీ పెట్టి 2019లో ఏపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలపై నిత్యం స్పందిస్తూ వార్తలో నిలుస్తారు. రాజకీయాల్లో కేఏ పాల్ కు ఆయన కోడలు జ్యోతి ఎంతో సహయపడుతుంది. ఆయన ప్రతి రాజకీయ వ్యుహంలో ఆమె పాత్ర ఉంటుంది. ఇటీవల సిద్దిపేట్ జిల్లాలో పాల్ పై అనిల్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కసారిగా దాడి చేసిన సమయంలోను జ్యోతి అక్కడే ఉన్నారు. పాల్ పై జరిగిన దాడి ఘటనపై జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోడలు జ్యోతిపై కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింల్ చక్కర్లు కొడుతుంది.
ఓ ఇంటర్వ్యూ లో కేఏ పాల్ మాట్లాడుతూ..” నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు దేవుడి దయవల్ల ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. నా కొడుకు, కోడలు జ్యోతి ఏడు సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. మా కుటుంబంలో జ్యోతి లాంటి స్ట్రాంగ్ పర్సన్ దొరకడం మాకు అదృష్టం. అయితే వీలైనంత త్వరగా నా కోడుకు, కోడలు పెళ్లి చేసుకోవాలి అని నా కోరిక, ప్రార్థన. వాళ్లిద్దరు మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోమని అంటున్నారు. ఇండియాలో జ్యోతి, ఆమె సోదరుడు నాకు సపోర్టుగా ఉంటున్నారు. నాపై దాడి జరిగిన రోజు ఎందుకో జ్యోతి తట్టుకోలేకపోయింది. ఇంక అవకాశం ఉంటే వాడిని అక్కడిక్కడే కొట్టేది. జ్యోతి దొరకడం మా భాగ్యం” అంటూ మరికొన్ని ఆసక్తిక విషయాలు వెల్లడించారు. మరి..కేఏ పాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.