ఒడిశా కోరమాండల్ రైలు ప్రమాద ఘటనపై తాజాగా స్పందించారు నటుడు Jr. NTR. ట్విట్టర్ లో స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఒడిశాలో కోరామండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 10 ఏళ్లలో ఇదే అతి పెద్ద ప్రమాదమని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 238 మంది పైగా మరణించగా, 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్పందించి ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అయితే, తాజాగా ఈ ప్రమాద ఘటనపై Jr. NTR సైతం స్పందిస్తూ ట్విట్టర్ లో ఎమోషనల్ ట్విట్ చేశారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదం నన్ను ఎంతగానో కలిచి వేసింది. ఈ కఠిన సమయంలో ఆ దేవుడు బాధితులకు ధైర్యం, భరోసా కల్పించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుండడం కంటతడి పెట్టిస్తుంది. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తుంది.
Heartfelt condolences to the families and their loved ones affected by the tragic train accident. My thoughts are with each and every person affected by this devastating incident. May strength and support surround them during this difficult time.
— Jr NTR (@tarak9999) June 3, 2023