ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోయాయి. రీసెంట్గా సికింద్రాబాద్లోని డెక్కన్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధన్బాద్, పురానా బజార్లోని హజ్రా హాస్పిటల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. తొమ్మిది మందిని అధికారులు కాపాడారు. మృతులను డాక్టర్ వికాస్ హజ్రా, ఆయన భార్య డాక్టర్ ప్రేమ హజ్రా, ఇతర ఉద్యోగులుగా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. రెండో అంతస్తులో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు క్రమంగా ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో రోగులకు ఎలాంటి గాయాలు అవ్వలేదని అధికారులు తెలిపారు.
హజ్రా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం ఘటన గురించి తెలియగానే ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు వాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హాస్పిటల్కు ఇరువైపులా చిక్కుకున్న మొత్తం 9 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.. వారందరినీ సమీపంలోని పాటలీపుత్ర నర్సింగ్ హోమ్లో చేర్చాయి. ప్రస్తుతం డాక్టర్లు వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో డాక్టర్ వికాస్ హజ్రా, ఆయన భార్య ప్రేమ హజ్రా, వీరి బంధువు సోహన్ కుమారితో పాటు పనిమనిషి తారా దేవి ప్రాణాలు కోల్పోయారని ధన్బాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరవింద్ కుమార్ చెప్పారు. ఐదో వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అరవింద్ కుమార్ పేర్కొన్నారు.
#WATCH धनबाद के एक अस्पताल के आवासीय परिसर में आग लगने से पांच लोगों की मृत्यु हो गयी। मृतकों में डॉक्टर, उनकी पत्नी और घरेलू सहायिका शामिल हैं: SSP धनबाद संजीव कुमार, झारखंड pic.twitter.com/Ac6nLnfXt7
— ANI_HindiNews (@AHindinews) January 28, 2023