బర్త్ డే – ఇళ్లలోను, హోటళ్లలోను లేదా ఫంక్షన్ హాళ్లలో చేసుకుంటారనేది జగమెరిగిన సత్యం. అయితే నడుస్తున్న రైలులో బర్త్డే పార్టీ చేసుకుంటే?.. ఈ అవకాశాన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు కల్పిస్తోంది. తేజస్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవారు ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. తేజస్ ఎక్స్ప్రెస్లో టిక్కెట్ బుక్ చేసుకున్న వారి వివరాలు ఐఆర్సీటీసీకి అందుతాయి. దీనిలో ప్రయాణికుల బర్త్ డే వివరాలు ఉంటాయి. దీనిప్రకారం తేజస్ ఎక్స్ప్రెస్ సిబ్బంది ప్రయాణికుల బర్త్ డేను సెలబ్రేట్ చేస్తారు. కరోనా సెకెండ్వేవ్ తరువాత తేజస్ ఎక్స్ప్రెస్ సేవలు ఆగస్టు 6 నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఐఆర్సీటీసీ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఐఆర్సీటీసీ లక్నో, న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా పథకాన్ని ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు ప్రారంభించింది.
IRCTC పథకం కింద కంప్యూటర్ ఆధారిత లక్కీ డ్రా జరుగుతోంది. దీనిలో కంప్యూటర్ చైర్ కారులో ప్రయాణిస్తున్న 10 మంది ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణిస్తున్న 3 మంది ప్రయాణికుల పేర్లను ఎంచుకుంటుంది. ప్రయాణీకులను వారి PNR ఆధారంగా ఎంపిక చేస్తారు. లక్నో- న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణీకుల కోసం ఈ లక్కీ డ్రా పథకం రూపొందించినట్లుగా ఐఆర్సిటిసి చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. PNR ఆధారంగా విజేతలను ఎంపిక చేయనున్నారని తెలిపారు. దీని తరువాత ఈ అదృష్ట ప్రయాణీకులకు రైలులోనే IRCTC బహుమతి ఇస్తోంది.
దేశంలో కొత్తగా తేజస్ పేరుతో ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయన్న సంగతి తెలిసిందే. ఈ రైళ్లు ఖచ్చిమైన సమయాలను పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సి వుంటుంది. ఒకవేళ ఆలస్యమైతే ప్రయాణికులకు అపరాధం చెల్లించాల్సివుంటుంది. రీసెంట్ గా భారీ వర్షం వల్ల ఢిల్లీ రైల్వే స్టేషన్లో సిగ్నల్ ఫెయిల్ అయింది. దీని కారణంగా తేజస్ రైలు దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా స్టేషనుకు చేరుకుంది. ఆదివారం కూడా లక్నో-ఢిల్లీ రైలు సుమారు గంటపాటు ఆలస్యంగా రావడం వల్ల ప్రయాణికులకు రూ.4 లక్షల నష్టపరిహారం చెల్లించారు.
తేజాస్ రైల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ఈ వీడియోలో చూడండి: