ప్రస్తుతం అంతర్జాతీయంగా ఐటీ రంగం కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక సంక్షోభం కారణంగా ఐటీ రంగంలో ఇబ్బందులు పడుతుంది. దీంతో దిగ్గజ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో మరో విధంగా కూడా ఉద్యోగులు బలవంతంగా ఇంటి బాట పడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ డ్యాక్యుమెంట్లు, ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టి ఉద్యోగాలు పొందినట్లు సంస్థలు గుర్తించాయి అలాంటి వారిని పెద్ద సంఖ్యలో విధుల నుంచి తొలగించినట్లు, మరిన్ని గుర్తించి తొలగించనున్నట్లు పలు ఐటీ సంస్థలు తెలిపాయి. అయితే డ్రీమ్ 11 కంపెనీ వ్యవస్థపకుడు ఉద్యోగాలు కోల్పోయిన వారి మంచి ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యోగం కోల్పోయిన వారు తమను సంప్రదించండి.. అంటూ ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు హరీశ్ జైన్ ట్వీట్ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ కంపెనీలైన ట్విటర్, మెటా, పేస్ బుక్, అసెంచర్, కాంగ్నిజెంట్ ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. యాపిల్, అమెజాన్ అల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థలో నియామక ప్రక్రియ నెమ్మదించింది. ఈక్రమంలో అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బి వీసాదారులు 60 రోజుల్లోగా మరో ఉద్యోగం చూసుకోవాల్సి పరిస్థితి ఉంది. వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ను కొనసాగించాలంటే వారు తప్పక జాబ్ పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి వారికి డ్రీమ్ 11 ఆఫర్ వరంలో దొరికింది. హరీశ్ జైన్ ఇచ్చిన ఆఫర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకుడు హరీశ్ జైన్ మాట్లాడుతూ.. “అమెరికాలో ఈ ఏడాది టెక్ సంస్ధల్లో 52 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో భారతీయుల ఉంటే స్వదేశానికి తిరిగి రండి. ముఖ్యంగా వీసా సమస్యలు ఉన్నవారు ఇండియాకు వచ్చి.. ఇక్కడ ఐటీ రంగ అభివృద్ధికి పాటుపడండి. రాబోయే కాలంలో భారత్ టెక్ రంగంలో భారీ వృద్ధికి అవకాశం ఉంది. మా సంస్థ కూడా ఆర్ధికంగా సుస్థిరంగా ఉంది. మా సంస్థలోని జాబ్ మీ అర్హతలకు తగినదని భావిస్తే సంకోచం లేకుండా సంప్రదించండి. ప్రొడక్ట్, డిజైనింగ్ ప్రొడక్ట్ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారి కోసం మేం ఎదురు చూస్తున్నాం” అని జైన్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు.