రాజస్థాన్ రాష్ట్రంలోని బలోత్రా సమీపంలోని రోడ్డుపై అమానుష ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బెడ్మార్కు చెందిన ఓ భార్య భర్తలిద్దరూ బైక్పై బలోత్రాకు బయలుదేరారు. రోడ్డుపై హయిగా వెళ్తున్న భార్యభర్తలను నలుగురు దుండగులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. భర్తను పట్టుకుని విపరీతంగా కొట్టి బాగా హింసించారు. దీంతో ఆ సమయానికి రోడ్డుపై ఎవరూ కూడా రాకపోవటంతో ఆ నలుగురు యువకులు మరింత రెచ్చిపోయారు.
ఇక నలుగురు దుండగుల్లో ఒక యువకుడు ఆ భర్త బైక్ తీసుకుని పరిగెత్తాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు దుండగులు భార్య భర్తలిద్దరినీ కొట్టి బలవంతంగా కారులోకి ఎక్కించారు. దీంతో ఆ తర్వాత భర్త కళ్లముందే కారులో ఆ వివాహితపై ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇక ముగ్గురు నిందితులను కమ్తాయ్, బాబులాల్, నరేష్లుగా గుర్తించారు పోలీసులు.