కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా జనాలు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇక పెళ్లి వేడుకలయితే.. పూర్తిగా బోసిపోయానని చెప్పవచ్చు. చాలా తక్కువ మంది అతిథుల సమక్షంలో పెళ్లి వేడుకలు జరిగాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గడంతో.. జనాలు మాస్క్ తీసి కాస్తా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. వివాహాది శుభకార్యలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ నేత ఇంట పెళ్లికి భారీగా హాజరయ్యారు జనాలు. అయితే దురదృష్టం కొద్ది విందు భోజనం తిన్న వారిలో కొందరు అస్వస్థతకు గురి కావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
గుజరాత్లోని మెహ్సనా జిల్లా, విస్నగర్ తాలుకా సవాలా గ్రామంలో కాంగ్రెస్ నేత కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి భారీగా అతిథులు తరలి వచ్చారు. ఈ క్రమంలో పెళ్లి విందు ఆరగించినవారిలో సుమారు 1200 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లే వీరంతా అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు.
వివాహంలో శాఖహార, మాంసాహార భోజనం ఏర్పాటు చేశారు. పెళ్లికి భారీగా అతిథులు హాజరయ్యారు. ఈ క్రమంలో వివాహానికి వచ్చిన వారిలో 1200మంది అస్వస్థతకు గురయయారు. కలుషిత ఆహారం తినడం వల్లే.. వీరంతా అస్వస్థతకు గురయినట్లు తెలిసింది. బాధితుల్లో చాలా మంది వాంతులు చేసుకున్నారు. డయేరియా సమస్యలు తలెత్తాయి. వీరందరిని ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సరఫరా చేసిన ఆహారం నమూనాలను సేకరించి.. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. ఫుడ్ అండ్ డ్రగ్ శాఖ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.