ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘటం. ఈ బంధంతో యువతి యువకులు కొత్త జీతంలోకి అడుగుపెడుతుంటారు. అయితే ఈ పెళ్లి తరువాత వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. స్నేహితులతో షికార్లు, పార్టీలకు చెక్ పెట్టి సంసార సాగరంలో ఈదడం సహజం. అయితే కొందరు అప్పటి వరకూ స్నేహితులతో ఎంతో సరద సరదాగా గడిపి.. ఒక్కసారిగా వైవాహిక జీవితంలోకి వెళ్లే సరికి వాటిని తగ్గించుకోలేకపోతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటాయి. అయితే కొందరు మహిళలు.. భర్తలను అర్ధం చేసుకుని సర్ధుకు పోతుంటారు. అలానే తాజాగా ఓ వధువు తన భర్త విషయంలో విశాలంగా ఆలోచించింది. తన భర్త పెళ్లి తర్వాత స్నేహితులు దూరం కాకూడదనే ఉద్దేశంతో కొంత వెసులుబాటు కల్పించింది. ఏకంగా రూ.50 బాండ్ పేపర్ పై రాసి పెళ్లికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పెళ్లి తరువాత ప్రతి యువకుడు జీవితం పూర్తిగా మారిపోతుంది. బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పి.. వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంటారు. అయితే ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుంటారు. అయితే ఎక్కడ ఉన్న సాయంత్రం ఆరు దాటితే చాలు ఇంటికి రాకపోతే భార్య నుంచి ఫోన్లు వెళ్తుంటాయి. సింగిల్ గా ఉన్నప్పుడు ఏ టైమ్ కి ఇంటికి వెళ్లిన అడిగే వాడు ఉండడు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న విధంగా ఉంటుంది సింగిల్ లైఫ్. ఇక పెళ్లైన తరువాత ఇంటికి టైమ్ రాకుంటే కొందరు భార్యలు ఫోన్లు చేసి చివాట్లు పెడుతుంటారు. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? అని ఆరా తీస్తుంటారు.
పొరపాటున స్నేహితులు బలవంతపెట్టి మందుకొట్టి వెళ్తే ఇక అతడి పని గోవిందా. అతడి పరిస్థితి చూసి.. ఫ్రెండ్స్ కూడా దూరంగా ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భర్తలందరూ కేరళకు చెందిన ఓ నవవరుడి గురించి తెలిస్తే అసుయాపడతారు. ఎందుకంటే పెళ్లిమండపం మీద ఉన్నప్పుడే వధువు వరుడికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఆఫర్ కు ఆ నవ వరుడు ఎగిరి గెంతేశాడు. ఇంతకి ఆమె ఇచ్చిన ఆఫర్ ఏమింటే.. రాత్రి 9 గంటల వరకూ స్నేహితులతో ఎంచక్కా సరదాగా తిరగొచ్చని.. తాను ఫోన్ చేసి విసిగించనని హామీ ఇచ్చింది. కేవలం నోటి మాటతో సరిపెట్టకుండా చేతి రాతతో హామి ఇచ్చింది. రూ.50 బాండ్ పేపర్ మీద రాసి మరీ హామీ ఇచ్చింది. దీంతో వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు అవాక్కయ్యారు.
కేరళ రాష్ట్రం పాలక్కడ లోని కంజి కోడ్ కు చెందిన రఘు అనే యువకుడికి అర్చన అనే యువతితో నవంబరు 5న వివాహం జరిగింది. రఘుకు బ్యాండ్మింటన్ ఆటలో మంచి గుర్తింపు ఉంది. దీంతో స్నేహితులతో కలిసి ఈవినింగ్ టైమ్ లో ఆటలు ఆడుతుంటాడు. అతడిని అర్ధం చేసుకున్న అర్చన తన భర్తకు ఈ ఆఫర్ ఇచ్చింది. రాత్రి 9 వరకు తన భర్త .. స్నేహితులతో తిరిగొచ్చని వధువు అర్చన బాండ్ పేపర్పై రాసి సంతకం చేసింది. వరుడి స్నేహితుల సమక్షంలో ఆమె ఈ లిఖితపూర్వక హామీ ఇవ్వడం విశేషం. దీంతో వారంతా ఆనందంతో గంతులు వేశారు. తర్వాత మలయాళంలో రాసి ఉన్న ఈ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.