రాఖీ పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికులకు ఉచిత ప్రయాణ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే రాఖీ పండగను గొప్పగా జరుపుకుంటారు అన్నా చెల్లెల్లు. ఇక అన్నా చెల్లెల మధ్య బంధాన్ని ప్రతీకగా నిలిచే ఈ ఫెస్టివల్ను గొప్పగా జరుపుకుంటారు. ఈ పండగ నేపథ్యంలోనే తాజాగా ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం మహిళలకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రక్షా బంధన్కు వెళ్లే మహిళలకు రాష్ట్రంలో ఏ బస్సులైనా, ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది యూపీ సర్కార్. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం విశేషం.
రాష్ట్రంలో ఈ ఆఫర్ 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుందని తెలిపింది. దీంతో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తెలిపింది. ఇక ఇదే కాకుండా ఐఆర్ టీ సి కూడా మహిళలకు రైళ్లో ఉచిత ప్రయాణ వేసులుబాటును కల్పించింది. దీంతో తాజాగా తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లలో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఇక మహిళా ప్రయాణికులకు 5 శాతం క్యాష్బ్యాక్ ప్రకటించి 15 ఆగస్టు 2021, 23 ఆగష్టు 2021 మధ్య తమ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రకటనలోతెలిపింది.