ఎక్కువ మంది ప్రజలు రైలు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాక దూర ప్రయాణాలకు రైలు సరైనది కాక చాలా మంది భావిస్తుంటారు. అంతే కాక రేట్లు కూడా బస్సులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలు రైలు జర్నీకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఒక్కోసారి రైళ్లు ఖాళీయే వుండవు. రైళ్లు అన్ని ఫుల్ అయ్యిపోతూ ఉంటాయి. అయితే ఆర్ఏసీ టిక్కెట్లను మరియు వెయిటింగ్ లిస్ట్ ని కన్ఫర్మ్ చెయ్యడానికి రైల్వే సరికొత్త టెక్నాలజీని తీసుకు రావడం జరిగింది.
ఆర్ఏసీ మరియు వెయిటింగ్ లిస్ట్ లో ఉండే వారికి సీటు కన్ఫర్మ్ చేసేందుకు ఇండియన్ రైల్వే వ్యవస్థ హ్యాండ్-హెల్డ్ టర్నినల్స్(హెచ్ హెచ్ టీ) అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా గత నాలుగు నెలల్లో.. రోజూకి ఏడు వేల మంది టిక్కెట్ కన్ఫర్మ్ అవ్వని వారికి కన్ ఫామ్ చేశారు. ఈ టిక్కెట్స్ నే రియల్ టైమ్ బేసిస్ లో కూడా కన్ఫర్మ్ చేశారు. అదే మాదిరి ఎవరైనా టికెట్స్ ని రిజర్వేషన్ చేసుకుని చివరి క్షణంలో రద్దు చేసుకున్నా లేదా రాలేకపోయితుంటారు. అలాంటి వారి సమాచారం కూడా హెచ్హెచ్టీ డివైజ్లో కనపడతాయి. ఇక ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఆర్ఏసీ ప్రయాణికులకు లేదా ఇతర జనరల్ ప్యాసెంజర్లకి ఆ సీట్లను ఇచ్చేలా చేసింది. ఐప్యాడ్ సైజులో ఈ హెచ్హెచ్టీ డివైజ్ ఉంటుంది. ప్యాసెంజర్ ఛార్ట్లతో ఈ డివైజ్ ప్రీలోడ్ అయి ఉంటుంది.
టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ డైరెక్ట్ ఈ డివైజ్ ద్వారా రియల్ టైమ్ అప్డేట్లను పరిశీలించేందుకు వీలవుతుంది. అలానే ప్రయాణికుల నుంచి అదనపు ఫీజులను, జరిమానాలను, ఇతర ఛార్జీలను వసూలు చేసేందుకు కూడా ఈ డివైజ్ ను వాడొచ్చు.డిజిటల్ పేమెంట్స్ ద్వారా కూడా ఈ ఛార్జీలను కలెక్ట్ చెయ్యచ్చు. రసీదులు వసూలు చేయడానికి కూడా హెచ్ హెచ్ టీ డివైజ్ ను వాడడానికి అవుతుంది. రైళ్లలో కూడా మహిళలకు ప్రత్యేక సీట్లను దీని ద్వారా కేటాయించడం జరుగుతోంది. టిక్కెట్ల జారీ, సీట్ల జారీలో అవినీతి, అక్రమాలను తగ్గించడం కోసం కూడ ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగ పడుతుంది. మరి.. ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త టెక్నాలజీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.