రష్యా , ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో వందలాది మంది భారతీయులు స్వదేశి బాట పడుతున్నారు. వైద్యవిద్యను పూర్తి చేసి లేదా మధ్యలో ఆపేసి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయ విద్యార్థులకు జాతీయ మెడికల్ కౌన్సిల్(NMC) గుడ్ న్యూస్ చెప్పింది. ఉక్రెయిన్ లో MBBS పూర్తి చేసిన వారికి మనదేశంలో ఇంటర్న్ షిప్ కు అనుమతిని ఇచ్చింది. వైద్య విద్యలో మధ్యలో ఉన్న వారికీ ప్రైవేటు కాలేజిలలో ప్రవేశాలకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది NMC. ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తోన్న వందలాది మంది విద్యార్థులు ఇది పెద్ద ఊరట.
NMC నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారు అక్కడే ఇంటర్న్ షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఇండియాలో వైద్యుడిగా గుర్తింపు పొందాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయేట్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధించాలి. ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా అక్కడ వైద్య విద్యార్థులు ఇంటర్న షిప్ ఆగిపోయింది. మిగిలిపోయిన్ ఇంటర్న్ షిప్ ను భారత్ లో పూర్తి చేయడానికి NMC అనుమతి ఇచ్చింది.మరి.. జాతీయ మెడికల్ కౌన్సిల్ చెప్పిన ఈ గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.