బాల్యం.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో మధుర స్మృతులను కలిగి ఉంటుంది. ఆ మధుర స్మృతులను మనం అప్పుడప్పుడు నెమరేసుకుంటూనే ఉంటాం. ఇక పాఠశాల స్థాయిలో చేసే కోతి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. పెద్దయ్యాక అవన్నీ గుర్తుకు వచ్చినప్పుడు నవ్వురాక మానదు. ఇక ఇలాంటి సంఘటనలను మనం ఒకే దగ్గర గుర్తుకు తెచ్చుకుంటాం అదే.. గెట్ టు గెదర్ అదేనండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులోని జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం వైరల్ గా మారింది. ఒకే వేదికపై ఒకే బడిలో చదివిన 108 మంది పూర్వ విద్యార్థుల షష్టిపూర్తి జరిగింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచ్చి ప్రభుత్వ బాలుర పాఠశాల. ఆ బడిలో 1977-78 చదువుకున్న బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాజాగా గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఏముంది? అది చాలా మంది విద్యార్థులు చేసే పనేగా అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే? ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఓ విశేషం ఉంది. అదేంటంటే? 1977-78 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు సుమారు 45 సంవత్సరాల తర్వాత కలిశారు. ఇప్పుడు ఆ విద్యార్థులందరికి ప్రస్తుతం 60 ఏళ్లు దాటటంతో వారికి ఈ సందర్భంగా షష్టి పూర్తి చేశారు.
108 మంది పూర్వ విద్యార్థులకు ఒకే వేదికపై మళ్లీ తాళి కట్టించి షష్టి పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మరో మారు వారు తమ పాత స్మృతులను గుర్తు చేసుకున్నారు. చాలా కాలం తర్వాత తమ పాత స్నేహితులను కవడంతో వారు భావోద్వేగానికి గురైయ్యారు. అనంతరం ఈ వేడుకను ఎంతో కోలాహలంగా నిర్వహించారు. డ్యాన్స్ లు, పాటలతో ప్రాంగణాన్ని హోరేత్తించారు. ఈ కార్యక్రామానికి సంబంధించిన పనులన్నింటిని వారి వారి పిల్లలు, మనవళ్లు చూసుకున్నారు. చాలా సందర్బాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను చూశాం కానీ ఇలాంటి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సమ్మేళనాన్ని చూల్లేదని ఈ వీడియో చూసిన వారంతా అనుకుంటున్నారు.