ఉత్తర్ ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చాక్లెట్ తిని ఏకంగా నలుగురు చిన్నారులు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుషీనగర్ పరిధిలోని సిసాయి గ్రామంలో నలుగురు చిన్నారులు చాక్లెట్లు తిన్నారు. అయితే కొద్దిసేపు బాగానే ఉన్నా ఆ చిన్నారులు ఆ తర్వాత తీవ్ర అస్వస్థకు గురై మరణించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
మరణించిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందడం విశేషం. వీరి మరణంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి గురయ్యారు. దీనిపై వెంటనే విచారణ జరపాలంటూ సంభందిత అధికారులను ఆదేశించారు. ఇక మరణించిన చిన్నారుల వయస్సు 2-3 ఏళ్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.