ఈపీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సర్కారు తాజా నిర్ణయంతో 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది.
కోట్లాది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) 8.15 శాతం చొప్పున వడ్డీని చెల్లించాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతం వడ్డీని చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చందాదార్లకు 8.15 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని ఈపీఎఫ్వో నిర్ణయించింది. దీంతో దేశంలోని 6 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ ప్రయోజనం లభించనుంది. ఈపీఎఫ్వో తాజా నిర్ణయంతో చందాదార్ల ఖాతాల్లోకి మరింత డబ్బు జమవుతుంది. ఈ 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారుల్లో 72.73 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు.
కాగా, మంగళవారం జరిగగిన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎప్ వడ్డీ రేటును 8.15 శాతం ఇవ్వాలని నిర్ణయించారు. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపిస్తారు. సర్కారు నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్వో అధికారికంగా నోటిఫై చేస్తుంది. అనంతరం వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్వో చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనల మీద కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇకపోతే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ మీద వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటను 8.1 శాతంగా నిర్ణయించారు. గత 40 ఏళ్లలో పీఎఫ్పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావడం గమనార్హం.
EPFO decides the rate of interest EPF for FY23. The rate of interest on EPF would be 8.15% for FY23. The labour ministry will send the proposal to the finance ministry for approval. pic.twitter.com/tPBqLgVTXm
— ANI (@ANI) March 28, 2023