ఈ మద్య దేశంలో పలు చోట్ల భూ ప్రకంపణలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అయితే.. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడ్డారని అధికారులు చెప్తున్నారు. తూర్పు ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో శనివారం ఉదయం 5:03 గంటలకు భూకంపం సంభవించినట్టు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు మేల్కొని ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఇల్లు కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ స్పష్టం చేసింది.
ఇది చదవండి: రైల్వే పట్టాలపై బాలిక… స్పీడ్ గా వస్తున్న గూడ్స్ రైల్.. అంతలోనే ఓ వ్యక్తి
భూకంప కేంద్రం అక్షాంశం 30.72, రేఖాంశం 78.85 వద్ద 28 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. భూకంపం సంభవించిన సమయంలో ప్రజలు మేల్కొని ఉండటంతో ప్రాణ నష్టాలు ఏం జరగలేదని తెలిపారు. గత వారం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, నోయిడా వంటి ఇతర తరహా ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం 181మీటర్ల లోతులో సంభవించింది.
Earthquake of Magnitude:4.1, Occurred on 12-02-2022, 05:03:34 IST, Lat: 30.72 & Long: 78.85, Depth: 28 Km ,Location: 39km E of Uttarkashi, Uttarakhand, India for more information download the BhooKamp App https://t.co/8PBdCH0Ntp @ndmaindia @Indiametdept pic.twitter.com/BzqhThimQu
— National Center for Seismology (@NCS_Earthquake) February 12, 2022