ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అందులో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయి.. మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. కొన్ని వీడియోలు నిజంగా ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. ఓ రైలు వేగంగా దూసుకొస్తోంది. ఇంతలో సడెన్ గా ఒక ఏనుగు పట్టాలపైకి దూసుకువచ్చింది. దాంతో చూసేవారికి ఆ ట్రైన్ ఏనుగును ఢీ కొడుతుందని భావించారు.. అంతలోనే ఓ ట్విస్ట్ జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర బెంగాల్లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుల్మా సివోక్ మధ్య 23/1వద్ద ట్రాక్ ను దాటుతున్న ఏనుగు ఆకస్మాత్తుగా గమనించి… రైలు వేగాన్ని నియంత్రించడానికి బ్రేకులు వేసి ఆ ఏనుగు వెళ్లి వేరకు నెమ్మదిగా పోనిచ్చాడు డ్రైవర్. పట్టాలు దాటి ఆ ఏనుగు వెళ్లిపోయిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్తర బెంగాల్ కు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి ప్రతి ఒక్కరూ వణ్యప్రాణుల విషయంలో జాగ్రత్త పాటించాలని.. వాటి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Alert LP & ALP of 15767 Up SGUJ-APDJ Intercity Exp Sri R.R. Kumar & S. Kundu suddenly noticed one Wild Elephant crossing the track at KM 23/1 between Gulma-Sivok at 17.35 hrs yesterday & applied brake to control Train speed saving Wildlife. @wti_org_india@RailMinIndia @RailNf pic.twitter.com/12PC5ffTqO
— DRM APDJ (@drm_apdj) May 12, 2022