ఈ మద్య కాలంలో విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే పలు కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పైలెట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేసి ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు.
ఇటీవల విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సమయానికే విమానాలు, హెలికాప్టర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడం, పక్షులు ఢీ కొనడం, వాతావరణం అనుకూలించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను పైలెట్లు గుర్తించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడుతున్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కి పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కి పెద్ద ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ని హుసాకోట్ వద్ద ఒక డేగ ఢీ కొట్టింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో హెలికాప్టర్ ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదాన్ని వెంటనే పైలెట్ పసికట్టి చాకచాక్యంగా హెలికాప్టర్ ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో డీకే శివకుమార్ కెమెరా పర్సన్ కి స్వల్పంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.
ఈ క్రమంలోనే డీకే శివకుమార్ ముళబాగిలుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం డికే శివకుమార్ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కర్ణాటకలో ఈ నెల 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ముమ్మర ప్రచారాలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుం కర్ణాటకలో ఎన్నికల ప్రచారాల్లో ఓటర్లకు వరాల జల్లులు కురిపిస్తున్నారు.
Karnataka Congress president DK Shivakumar’s helicopter was hit by an eagle near Hosakote. He was on his way to Mulabagilu for an election rally. His camera person received minor injuries during the incident. pic.twitter.com/U6MEfu5ek9
— ANI (@ANI) May 2, 2023