దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా పలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా డీజిల్ వాహనాలపై నిషేధం విధించే లా కేంద్రం ముందడుగు వేస్తుంది.
దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా పలు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక సూచనలు చేసింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఆధారిత ఫోర్ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని పేర్కొంది.
ప్రస్తుతం డీజిల్ తో నడిచే వాహనాలు ఎక్కువగా రోడ్లైపై కనిపిస్తున్నాయి. పెట్రలో, డీజిల్ తో నడిచే వాహనాలు కర్బన ఉద్గారాలని విడుదల చేస్తాయి. ముఖ్యంగా డీజిల్ తో నడిచే వాహనాల నుంచి కాస్త ఎక్కువగా కర్బన విడుదల జరుగుతుంది. అయితే దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ఓ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. 2027 నాటికి డీజిల్ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించాలని, వాటి స్థానంలో కరెంట్, గ్యాస్ ఆధారిత వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది.
ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో తయారైన మోటార్సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ తెలిపింది. ఈ లోపు చమురులో ఇథనాల్ ను కలిపే వాటాను పెంచాలని కమిటీ సూచించింది. అలానే చమురులో ఇథనాల్ ను కలిపే వాటాను పెంచాలని సూచించింది. ఫోర్ వీలర్ల వాహనాలను ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో నడిపే విధంగానూ.. మిగిలిన 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగాను మార్చాల్సిన అవసరం ఉంది.
అలానే డీజిల్ తో నడిచే వెహికల్స్ ను వీలైనంత త్వరగా తప్పించాలని తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల్లోకి మారే వరకు సీఎన్ జీ ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించాలని సూచించింది. ఫేమ్ సబ్సిడీ పొడిగింపునూ పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. చివరగా 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలానే ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్ నెట్ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది. మరి… ఈ నివేదికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.