జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు రావడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా ఒక పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. భయంతో విద్యార్థులందరూ స్కూలు విడిచి బయటకు పరుగులు తీశారు.
బాంబు బెదిరింపుల గురించి వార్తల్లో చూస్తూనే ఉంటాం. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఒక స్కూలులో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. హెచ్చరిక వచ్చిన వెంటనే స్కూలు యాజమాన్యం అలర్ట్ అయింది. స్టూడెంట్స్ అందర్నీ బయటకు తరలించింది. సాదిక్ నగర్లోని ఇండియన్ పబ్లిక్ స్కూలుకు ఉదయం 10 గంటల 49 నిమిషాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాలలో బాంబు పెట్టామని మెయిల్స్లో బెదిరించారు. ఇది చూసి ఆందోళన పడిన స్కూలు యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపింది.
స్టూడెంట్స్ను బయటకు పంపిన పాఠశాల యాజమాన్యం మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ తల్లిదండ్రులకు మెసేజ్లు పెట్టింది. దీంతో స్కూలు దగ్గర వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పేరెంట్స్ కంగారు పడి స్కూల్కు వచ్చారు. స్టూడెంట్స్, పేరెంట్స్తో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పిల్లల్ని తీసుకెళ్లమని మెసేజ్లు రావడంతో కంగారు పడిపోయి వచ్చేశామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాంబు బెదిరింపు గురించి తెలియగానే పోలీసులు స్కూలుకు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు తమకు కనిపించలేదని పోలీసులు చెప్పారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇదే స్కూలుకు పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం.
The Indian School in Sadiq Nagar received an bomb threat via email. As a precautionary measure, the school has been vacated. Bomb Detection and Disposal Squad informed: Delhi police
More details awaited. pic.twitter.com/p6DKKeSXsl
— ANI (@ANI) April 12, 2023