సాధారణంగా జైలులో కొంత మంది ఖైదీలు అధికారులకు తెలియకుండా ఫోన్లు వాడుతుంటారు. తరచూ అధికారులు చెకింగ్ వాటిని పట్టుకోవడం లాంటి ఘటనలు వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలా ఓ జైల్లో అధికారులు చెకింగ్ కోసం రావడంతో తన వద్ద ఉన్న ఫోన్ విషయం బయట పడుతుందని ఫోన్ మింగేశాడు ఖైదీ. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. చివరికి అధికారులు ఆసుపత్రికి తీసుకు వెళ్లి ఖైదీ కడుపులో నుంచి ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు.
ఇది చదవండి : వైరల్ వీడియో: గేదె పై సవారీ చేయబోయి బొక్కబోర్లా పడిన మహిళ..!
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని తీహార్ జైలులో అధికారులు ఆకస్మిక తనిఖీ కోసం వచ్చారు. అంతే విషయం తెలుసుకున్న ఓ ఖైదీ వాళ్లకు దొరక్కుండా ఉండాలని దానిని అతి కష్టం మీద మింగేశాడు. పూర్తిగా మింగకుండా గొంతులోనే ఆపేసి.. అధికారులు వెళ్లిపోయాక ఫోన్ బయటకు తీసి మళ్లీ వాడుకుందామనుకున్న ప్లాన్ వేశాడు. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టింది.. ఖైదీకి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆ ఫోన్ జారి కడుపులోకి వెళ్లిపోయింది. అప్పటికి తప్పించుకున్నా తర్వాత కడుపు నొప్పి తీవ్రమైంది. దీంతో జైలు అధికారులు ఢిల్లీలోని హాస్పిటల్కు తరలించారు.
ఇది చదవండి : వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన అధికారిపై దాడి.. వీడియో వైరల్
ఖైదీ పొట్ట ఎక్స్ రే చేయగా.. లోపల ఫోన్ ఉన్నట్టు గుర్తించామని డాక్టర్ సిద్ధార్థ్ నేతృత్వంలోని టీమ్ తెలిపింది. దాంతో పోలీసులు ఒక్కసారే షాక్ తిన్నారు. ఎండోస్కోపీ సర్జరీ చేసి.. ఫోన్ను చిన్నపాటి వల సాయంతో పైకి లాగి నోటి ద్వారా బయటకు తీశామని డాక్టర్లు చెప్పారు. ఆ ఫోన్ ఏడు సెంటీ మీటర్ల పొడవు, మూడు సెంటీ మీటర్ల వెడల్పు ఉందని తెలిపారు. జైలు అధికారులు తన వద్ద మొబైల్ ఉన్నట్లు గుర్తిస్తారన్న భయంతో ఖైదీ ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 5న ఈఘటన జరిగినట్లు జైళ్ల శాఖ ఐజీ సందీప్ గోయల్ చెప్పారు. చికిత్స పూర్తైన అనంతరం తిరిగి ఖైదీని జైలుకు తరలించామన్నారు. ఖైదీ ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పారు.
Delhi: Mobile phone swallowed by jail inmate removed after surgery
Read @ANI Story | https://t.co/5ngHX0zvhZ#Delhi pic.twitter.com/HNTOmYDHJw
— ANI Digital (@ani_digital) January 19, 2022