దేశంలో 2 వేల రూపాయల నోట్ల రద్దు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు రెండు వేల నోట్లు మార్చుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల ముందు పడికాపులు కాస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం చలామణీలో ఉన్న రూ. 2వేల రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రెండు వేల నోట్లను రద్దు చేసి దాదాపు వారం రోజులు అవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నోట్లు మార్చుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ఇబ్బందులను తమకు సానుకూలంగా మార్చుకుంటున్నాయి కొన్ని వ్యాపార సంస్థలు. 2 వేల నోట్ల మార్పిడిని ప్రవేశపెట్టాయి. 2 వేల నోట్లు ఇచ్చి తమ వస్తువులను కొనుక్కోవచ్చు అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న చాలా వ్యాపార సంస్థలు ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాయి. అయితే, ఓ షాపు ఓ అడుగు ముందుకు వేసి తమ మార్కెటింగ్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. 2 వేల నోటుతో సరుకులు కొంటే 100 రూపాయల లాభం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ నగర్లో సర్థార్ మాంసం కొట్టు ఉంది. ఈ షాపు ఓనర్ ఓ కొత్త ఐడియాను ఇంప్లిమెంట్ చేయటానికి డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు ఓ బోర్డును తన షాపునకు తగిలించాడు.
‘‘ 2 వేల రూపాయల నోటు ఇవ్వండి.. 2,100 రూపాయల సరుకులు పొందండి. సర్థార్ మీట్ షాపు.. జీబీటీ నగర్’’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ బోర్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షాపు యజమాని తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బోర్డుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఆపదను కూడా ఎలా వాడుకోవాలో తెలిసి ఉండటమే వ్యాపారి లక్షణం’’.. ‘‘ ఇలాంటి ఐడియాలు ఇండియన్స్కు మాత్రమే వస్తాయి’’.. ‘‘ ఏది ఏమైనా ఆ వ్యాపారి ఐడియా సూపర్గా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ ఢిల్లీ వ్యాపారి తెలివిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
If you think RBI is smart, think again cos Delhites are much smarter.
What an innovative way to increase your sales! 😅#2000Note pic.twitter.com/ALb2FNDJi0
— Sumit Agarwal 🇮🇳 (@sumitagarwal_IN) May 22, 2023