ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటు వస్తున్నారు కేరళా సీఎం పినరయి విజయన్. తాజాగా ఆయనకు ఇక్కడ కోర్టు ఝలక్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ తో పాటు ముఖ్యమంతి పర్సనల్ సిబ్బంది కి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది తిరువనంతపురం కోర్టు.
ఆ మద్య ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు గొడవకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేశాయి. అయితే ఈ విషయంలో జయరాజన్ పై చర్యలు అవసరం లేదని సీఎం పినరయి ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఎల్డీ ఎఫ్ పినరయి ప్రభుత్వావానికి షాక్ ఇచ్చింది. కాగా, గొడవ సమయంలో తాము ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు పట్టించుకోలేదని బెయిల్ పై వచ్చిన ఇద్దరు కార్యకర్తలు ఆరోపించారు.
ఈ మేరకు గొడవకు సంబంధించిన వ్యవహారం సీరియస్ గా తీసుకున్న తిరువనంతపురం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జయరాజన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అంతేకాదు ఆయనతో పాటు సీఎం వ్యక్తిగత సిబ్బంది అనీల్, సునీష్ లను కూడా ఏఎఫ్ఐ ఆర్ లో చేర్చాలసిందిగా న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In a major security lapse, Youth Congress workers protest against Kerala Chief Minister Pinarayi Vijayan on the flight from Kannur to Trivandrum. Meanwhile, the Kerala CM has arrived in Trivandrum. More details awaited. @IndiaAheadNews pic.twitter.com/2oKyz20rsr
— Korah Abraham (@thekorahabraham) June 13, 2022