కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో అలజడి సృష్టిస్తుంది. ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్ రోజు రోజుకీ భారత్లోనూ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారత్ లో 10 వేలకు దిగువకు నమోదవుతోన్న కేసులు బుధవారం ఒక్కరోజే 13 వేల మార్కును దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కొత్త వేరియంట్ బాధితులు 961కి చేరారు. అయితే వీరిలో 320 మంది వైరస్ నుండి కోలుకున్నట్లు తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,154 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155తో పోలిస్తే 40 శాతం పెరిగాయి. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది.
ఇది చదవండి : రోడ్డుపై డబ్బు సంచులు.. అన్నీ 500, 2000 వేల రూపాయల నోట్లే!
కొత్త కేసులతో కలిపి దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 82,402కు చేరుకున్నాయి. కాగా గత 24 గంటల్లో 7486 మంది వైరస్ను జయించారు. ఇప్పటివరకు 3.48 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.42 కోట్లమంది రికవరీ(98.38శాతం) అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 143 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేస్తామని కేంద్రం వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/rrT3krGD3S pic.twitter.com/WUlpXzU3BU
— Ministry of Health (@MoHFW_INDIA) December 30, 2021