దక్షిణాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ రోజు రోజుకు ప్రపంచదేశాలకు విస్తరిస్తున్నది. తాజాగా భారత్లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ వరుస కేసులతో విజృంభిస్తోంది. ఇప్పటికే 20 రాష్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ ప్రజలపై విరుచుకుపడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 135 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఆయా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.
ఇక దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,358 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,99,691కి పెరిగింది. ఇందులో 3,42,43,945 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 4,80,290 మంది మరణించారు. నిన్న కరోనా నుంచి 6,450 మంది కోలుకున్నారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 75,456 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. గత 24 గంటల్లో మరో 293 మంది మరణించినట్లు తెలిపారు. రికవరీ రేటు 98.40గా ఉందని చెప్పింది.
ఇది కూడా చదవండి : తారక్ ది చిన్నపిల్లల మనస్థత్వం, చరణ్ మై హీరో.. రాజమౌళి కామెంట్స్
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 63 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో కేసుల సంఖ్య 142కు చేరింది. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 12 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 167లుగా ఉంది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు కూడా విధిస్తున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/13fIWjJLfI pic.twitter.com/weRVI75lfF
— Ministry of Health (@MoHFW_INDIA) December 28, 2021