దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. మొత్తానికి దేశ వ్యాప్తంగా పదివేలకు తక్కువగానే కేసులు నమోదు అవుతున్నాయి. కాకపోతే మరణాలు మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నారు. మొన్న 5,326 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా.. నిన్న స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 కొత్తగా దేశంలో 6,317 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా 6,906 మంది బాధితులు కోలుకున్నారని, వైరస్ బారినపడి 318 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. కేసుల సంఖ్య 575 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా వల్ల మొత్తం 4,78,325 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారినపడి మొత్తం 4,78,325 మంది ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,58,481కు పెరగ్గా.. ఇందులో 3,42,01,966 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి : పాకిస్థాన్ కు చెందిన 20 యూట్యూబ్ చానల్స్ ను నిషేదించిన కేంద్రం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 213కు పెరిగిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో 57, 54 కేసులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 90 ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు కోలుకున్నారని వివరించింది. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారందరికీ చికిత్స అందుతోంది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/n5EOG5BbSn pic.twitter.com/Rh8lpyyrje
— Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2021