దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్రరూపం దాల్చే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్ది రోజులుగా నిలకడగా సాగుతున్న కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి కరోనా బారినపడ్డారు. గత కొంత కాలంగా సోనియాగాంధీ వరుసగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమకు స్వల్పంగా జ్వరం రావడం.. ఇతర ఇబ్బందులు పడుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అయిన సుర్జేవాలా తెలిపారు.
ఆమెకు పరీక్షలు జరిపిన తర్వాత కరోనా పాజిటీవ్ అని తేలింది.. ప్రస్తుతం సోనియాగాంధీ డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక సోనియాగాంధీ తో పాటుగా ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి అయిన కేసీ వెణు గోపాల్ కి కూడా కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. దీంతో ఆయన కూడా ఐసోలేషన్ కి వెళ్లారు. అంతేకాదు ఇటీవల కాలంలో సోనియాగాంధీని కలిసిన పలువురు నేతలు ప్రస్తుతం ఐసోలేషన్ లో గడుపుతున్నారు.
ఇది చదవండి: అద్భుతం చేసిన వైద్యుడు..! 54 ఏళ్ల తర్వాత కంటి చూపు పొందిన వ్యక్తి!
ప్రస్తుతం సోనియాగాంధి రెస్ట్ తీసుకుంటున్నారని.. వైద్యులు ఆమెకు తగినంత విశ్రాంతి ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోనియాగాంధీ ఆమె తనయుడు రాహూల్ గాంధీ కి నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సమయంలో ఆమె కరోనా భారిన పడటంతో సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Congress president Sonia Gandhi tests positive for COVID-19. She has developed mild fever & some symptoms & has isolated herself and has been given requisite medical attention. As of today, her date of appearance before ED on June 8th stands as it is: Congress’ Randeep Surjewala pic.twitter.com/0eTTN1RhUn
— ANI (@ANI) June 2, 2022
Congress president #SoniaGandhi tests covid positive.
I pray for her speedy recovery. pic.twitter.com/uhQnKj9arP
— Gautam (@GautamIND29) June 2, 2022