ఈ మద్య విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. కొన్ని సార్లు అదృష్టం బాగుండి ముందుగానే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను పక్షి ఢీ కొట్టడంతో వెంటనే అప్రమత్తమైన ఫైలెట్ హెలికాఫ్టర్ను వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
వారణాసికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే శాంతి భద్రతల అంశాలను సమీక్షించారు. ఈరోజు(ఆదివారం) ఉదయం తిరిగి లక్నో వెళ్లేందుకు వారణాసిలోని రిజర్వు పోలీసు లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరారు. హెలికాఫ్టర్ టేకాప్ అయిన కాసేపటికే ఆకాశంలో ఓ పక్షి ఢీకొట్టడంతో పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం సంబవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ కు సాంకేతిక పరీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత సీఎం యోగి సర్క్యూట్ హౌస్ కి వెళ్లారని సమాచారం. అయితే సీఎం లక్నో వెళ్లేందుకు అధికారులు ప్రభుత్వ విమానం ఏర్పాటు చేయడంతో ఆయన బాబట్ పూర్ విమానాశ్రయం నుంచి బయలు దేరారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రోడ్డు మార్గాన యోగి బాబట్ పూర్ విమానాశ్రయానికి వెళ్లారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
UP CM Yogi Adityanath’s helicopter made an emergency landing at Varanasi airport after a bird-hit incident today. The CM and his staff are safe and will be travelling to Lucknow by another aircraft: DM #Varanasi @dmvaranasi2016 @myogiadityanath #BreakingNews pic.twitter.com/3JIhS9kRHv
— Anant Dev Pandey (@Journalist_adp) June 26, 2022