ఈ మద్య కాలంలో మనిషి సెల్ ఫోన్ లేనిదే బతకలేం అన్న పరిస్థితిలో ఉన్నారు. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్రతీ క్షణం సెల్ ఫోన్ తో గడుపుతున్న రోజులు. ఒక్క క్షణం సెల్ ఫోన్ కనిపించకుంటే జీవితంలో ఏదో కోల్పోయాం అన్న భ్రలో బతుకుతున్నారు.
ప్రపంచంలో కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పుల వచ్చాయి. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్టే. సమాచారం మాత్రమే కాదు.. ఎంటర్ టైన్ మెంట్, సెల్ఫీలు, వీడియోలు ఇలా ఎన్నో రకాలుగా సెల్ ఫోన్ ని వాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయ్యింది. ఓ ప్రభుత్వ అధికారి తన సెల్ ఫోన్ కోసం ఏకంగా 21 లక్షల లీటర్ల నీటిని వృధ చేశాడు. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లో చోటు చేసుకుంది.
సాధారణంగా మనం సెల్ ఫోన్ నీటిలో పడితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పెద్ద చెరువులోగాని, కాలువలోగాని, ఎక్కువ నీరున్న ప్రాంతాలలో పడితే తీసుకోలేం… బ్యాడ్ లక్ అనుకొని వెళ్లిపోతాం. కానీ ఓ అధికారి తన సెల్ ఫోన్ నీళ్లలో పడిందని ఏకంగా రిజర్వాయర్ నీటిని మొత్తాన్ని తోడించాడు. ఛత్తీస్ ఘడ్కు చెందిన ఫుడ్ ఇన్పెక్టర్ రాజేశ్ విహారయాత్రకు వెళ్లాడు. విహారయాత్రలో భాగంగా ఖేర్కట్టా పర్కోట్ రిజర్వాజయర్కు వెళ్లాడు. అక్కడ సరదాగా సెల్ఫీ దిగుతుండగా అతని ఫోన్ నీటిలో పడిపోయింది. ఆ మొబైల్ విలువ సుమారు రూ. 96వేలు ఉంటుంది. దీంతో జలవనరుల శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులకు తన సెల్ ఫోన్ నీళ్లలో పడిపోయిందని ఎలాగైనా తీసి ఇవ్వాలని ఆదేశించాడు. అధికారులు వెంటనే స్పందించి రిజర్వాయర్ నీటిని తోడించి ఎలాగైనా ఫోన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో రిజర్వాయర్ లో ఉన్న 21 లక్షల లీటర్ల నీటిని మూడు రోజులుగా పంపులతో బయటకు వృథాగా పంపించారు. మూడు రోజుల తర్వాత సెల్ ఫోన్ దొరికింది. కానీ అది మాత్రం పనిచేయలేదు.. మూడు రోజుల నీటిలో నానిపోవడం వల్ల పాడైపోయింది. ఇదిలా ఉంటే సదరు అధికారి చేసిన ఘనకార్యం కాస్త అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసింది. ఫోన్ కోసం ప్రజల సాగు, తాగు నీరు, అవసరాలకు ఉపయోగపడే 21 లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తారా అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. సీఎం ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇలా రాజేశ్ చేసిన పనికి రాజకీయ దుమారం రేగింది. విషయం వెలుగులోకి రావడంతో రాజేశ్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
In #Chhattisgarh, an officer’s I-phone fell into a dam reservoir. Two pumps of 30 horsepower, ran 24 hrs, and pumped out-hold your breath- 21 lakh litres of #water, this water could have irrigated 1,500 acres of land, & this is when “there is severe shortage of water i the area ! pic.twitter.com/vBSol7EafS
— Ramandeep Singh Mann (@ramanmann1974) May 26, 2023