దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. ప్రజలకు పెనుభారంగా మారిన వంట గ్యాస్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్నవారికి రూ.200 సబ్సిడీ అనేది ఏడాదికి 12 సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో 9 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1003గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.800కు తగ్గనుంది. ఇక దీనితో పాటు.. కేంద్రం తాజాగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తద్వారా పెట్రోల్ పై లీటర్కు రూ. 9.5, డీజిల్పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
గతకొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఈ వార్త కాస్త ఊరటనిచ్చింది. నిజానికి దేశ ప్రజలు గతకొంత కాలంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం కాదనలేని సత్యం. ప్రజల్లో ఈ అసంతృప్తి రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనతోనే కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా.. సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు.. ఈ మాత్రమైనా తగ్గడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
9/12 Also, this year, we will give a subsidy of ₹ 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana. This will help our mothers and sisters. This will have a revenue implication of around ₹ 6100 crore a year. #Ujjwala
— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022