కార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రానున్న ప్రతి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలాల కేంద్రం కఠిన నిబంధనను అమలులోకి తీసుక రానుంది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకురానుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఓ కీలక ప్రకటన చేశారు. కార్ల వేరియంట్లు, ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి కారులో కనీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణించిన సంగతి తెలిసిందే. అహ్మాదాబాద్ నుంచి మంబై వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. మహారాష్ట్ర పాల్ఘడ్ జిల్లా సూర్య నది వంతెనపై డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో సైరస్ మిస్త్రీ కారు వెనుక సీట్లు కూర్చున్నారు. ముందుకు కూర్చున్న వారు గాయాలతో బయటపడగా.. కారులో వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ దుర్మరణం చెందారు. దీంతో ఈ ప్రమాదంపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పలు విషయాలను గమనించింది. వెనుక కూడా ఎయిర్ బ్యాగు లేకపోడవంతో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారని తేల్చారు. ఇకపై జరిగే ప్రమాదాల్లో ముందు సీట్లలో కూర్చున్న వారే కాకుండా వెనుక సీట్లలో కూర్చున్న వారు కూడా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఇకపై రానున్న ప్రతి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండాలని కేంద్ర మంత్రి గట్కారి స్పష్టం చేశారు.
Safety of all passengers travelling in motor vehicles irrespective of their cost and variants is the foremost priority.
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2022