పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మరుపురాని వేడుక. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. కొందరు అయితే కాబోయే శ్రీమతికి మరచిపోలేని బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటారు. కాబోయే శ్రీమతి కోసం డైమండ్ నెక్లెస్లు, విలువైన గడియారాలు ఖరీదైన కార్లు విల్లాలు బహుమతిగా ఇస్తుంటారు కొందరు. వీరందరికి భిన్నంగా గుజరాత్ కు చెందిన ఓ పెళ్లి కుమారుడు తన కాబోయే జీవిత భాగస్వామికి ఎవర్వూ ఊహిచని గిఫ్ట్ ఇచ్చి అందరిని షాక్ కి గురిచేశాడు. జాబిల్లి పై స్థలం పెళ్లి కూతురికి గిఫ్ట్ గా ఇచ్చి ఆమెను ఆశ్చర్య పరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని వడోదరకు చెందిన యయూర్ పాటిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. యయూర్, హేమాలి పాటిల్ అనే యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని భావించాడు పాటిల్. ఇదే సమయంలో తనకు కాబోయే భార్యకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా అనుకున్నాడు. జాబిల్లి పై స్థలం బహుమతిగా ఇవ్వాలని ఆలోచన మదిలో మెదిలింది. వెంటనే ఆలస్యం చేయకుండా అమెరికా బేస్డ్ ఆర్గనైజేషన్ సంప్రదించాడు.
చంద్రమండలం మీద స్థలం కోని తనకు కాబోయే శ్రీమతి పేరున రిజిస్టర్ చేసి ఇచ్చాడు. తమ వివాహం రోజున ఆ పత్రాలను తన అర్ధాంగి చేతిలో పెట్టాడు. దీంతో ఆమె ఒక్క క్షణం అలా ఉండి పోయింది. ఆమెతో పాటు అక్కడి విచ్చేసిన అతిథులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.