గత కొంత కాలంగా బోరు బావిలో పడి చిన్నారి కన్నుమూత.. ఇలాంటి వార్తలు దేశంలో ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. చాలా మంది నీటి కోసం బోర్లు వేయడం.. అది ఫెయిల్ కాగానే దాన్ని పూడ్చకుండా వదిలివేయడంతో ఎంతో మంది చిన్నారు అందులో పడి చనిపోతున్నారు.. ఎక్కడో అతి కొద్ది మంది రెస్క్యూ టీమ్ వల్ల కాపాడబడుతున్నారు. ఓ 8 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు అధికారులు, రెస్క్యూ టీమ్ శ్రమిస్తున్నారు.
బేతూల్ జిల్లాలో ఓ పొలంలో బోరు బావి వేసి నీరు పడకపోవంతో పూడ్చకుండా అలాగే వదిలివేశారు. మంగళారం సాయంత్రం ఎనిమిదేళ్ల బాలుడు తన్మయ్ దియావర్ అడుకుంటూ వెళ్లి 400 అడుగు లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు బాలుడిని రక్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలుడికి ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సీజన్ పైపులు లోపలికి పంపించినట్లు తెలిపారు. బోరు బావి చుట్టూ త్రవ్వేందుకు ప్రొక్లెయినర్స్ ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి నుంచే రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాలుడితో తండ్రి మాట్లాడే ఏర్పాటు చేస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాలుడు ‘నాన్నా.. నాకు భయంగా ఉంది.. లోపల అంతా చీకటే.. త్వరగా బయటకు తీయండీ’ అని అంటున్నాడని తండ్రి బోరున విలపించాడు. 8 ఏళ్ల బాలుడు బోరు బావిలో పడిన విషయం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని కోరుతూ ట్వీట్ చేశారు.
Madhya Pradesh | A 5-year-old boy fell into a 55-ft deep borewell in Mandavi village in Betul district. Rescue operation is underway at the spot. SDRF teams rushed from Bhopal & Hoshangabad. Oxygen supply given to the child. pic.twitter.com/KAn2Oi26eB
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 6, 2022