భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. అయితే ఇటీవల కాలంలో దంపతుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. ఇలా దంపతులకు సంబంధించిన వివాదాల కేసులు కోర్టుల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కువ వరకట్నం వేధింపుల పేరుతో నమోదైన కేసులే అధికం. ఇలాంటి కేసులో కోర్టులు అనేక సంచలన తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఆధారాల్లేకుండా భర్తను తాగుబోతు, తిరుగుబోతు అన్నడం క్రూరత్వం కిందకి వస్తుందని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అదే బాంబే హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లైన మహిళతో ఇంటి పనులు చేయమని చెప్పడం క్రూరత్వం కిందకి రాదని తేల్చి చెప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన నెల రోజుల తర్వాత భర్త తనను పనిమనిషిలా చూడడం మొదలు పెట్టాడని, కారు కొనుక్కునేందుకు రూ.4 లక్షలు తీసుకురాలని డిమాండ్ చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక తనను మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించాడని బాధిత మహిళ తెలిపింది. ఈక్రమంలో కేసు బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ వెళ్లింది. కొన్నాళ్ల పాటు కేసుపై విచారణ జరిగింది. తాజాగా హైకోర్టు భర్తకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
పెళ్లైన మహిళను ఇంటి పనులు చేయమని అడగడం అంటే అది కచ్చితంగా కుటుంబ కోసమే అవుతుందని, దానిని పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇంటి పనులు చేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ రుజువు చేయలేకపోయారని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఈ కేసుకు సెక్షన్ 498ఏ వర్తించదని స్పష్టం చేస్తూ సదరు మహిళ భర్త, అత్తమామల పై పెట్టిన గృహహింస కేసును కొట్టి వేస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Section 498A IPC] Making married woman do household work for family not cruelty: Bombay High Court
Read story: https://t.co/tqn8btc4pV pic.twitter.com/5inYnuIhLk
— Bar & Bench (@barandbench) October 27, 2022