కరోనా కట్టడికి టీకా ఒక్కటే మార్గం.. కాబట్టి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుతున్నారు అధికారులు. అయితే బిహార్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేసుకున్నందకు ఓ వృద్ధుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. టీకా వేసుకుంటే.. కేసు పెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. ఆ వివరాలు తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.
ఇది కూడా చదవండి : ఆకలి కేకలు: స్మార్ట్ ఫోన్ ఇస్తాను.. బియ్యం పెట్టండి
బిహార్లోని మాధేపురా జిల్లాలోని ఒరై గ్రామానికి చెందిన 84 ఏళ్ల బ్రహ్మదేవ్ మండల్ అనే వ్యక్తి ఇప్పటి వరకు 11 సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. 12వ డోస్ తీసుకునేందుకు వెళ్లి పట్టుబడ్డాడు. బ్రహ్మదేవ్ మండల్ 11 సార్లు వ్యాక్సిన్ తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యాక్సిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందుకే పలుమార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్టు చెప్పాడు బ్రహ్మదేవ్ మండల్. “నేను వ్యాక్సిన్తో చాలా ప్రయోజనం పొందాను. టీకా అమృతంలా ఉంది. అందకే ఇన్ని సార్లు వేయించుకున్నాను” అని కొద్ది రోజుల క్రితం తెలిపాడు మండల్.
రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అయిన మండల్, గత ఏడాది ఫిబ్రవరిలో తన మొదటి కరోనా వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి మార్చి, మే, జూన్, జూలై, ఆగస్టు ఇలా ప్రతి నెల వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అలా డిసెంబర్ 30 నాటికి ఒకే పబ్లిక్ హెల్త్ సెంటర్లో 11 సార్లు వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఆ వ్యక్తి తన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ను వినియోగించి ఎనిమిది సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మిగిలిన మూడు సందర్భాల్లో తన ఓటర్ ఐడి కార్డ్, అతని భార్య ఫోన్ నంబర్ను ఉపయోగించాడని అధికార్లు తేల్చారు. దీంతో అతడిపై.. ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. జిల్లా వైద్యాధికారి డా.వినయ్ కృష్ణ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు బ్రహ్మదేవ్ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇది కూడా చదవండి : ముంబై ఎయిర్పోర్ట్లో భారత సంతతి వ్యక్తికి చేదు అనుభవం
తానే ఏయే తేదీల్లో టీకా తీసుకున్న విషయాలను కూడా రాసి పెట్టుకున్నాడు బ్రహ్మదేవ్. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో స్పందించిన జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. తాజాగా అతడిపై చర్యలకు దిగింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.