వంది మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదు. ఇదే మన న్యాయవ్యవస్థ నమ్మే సిద్ధాంతం. దాని ప్రకారమే మన దగ్గర కేసుల్లో చాలా జాప్యత చోటు చేసుకుంటుంది. ఎంత ఆలస్యమైనా సరే.. దోషికి శిక్ష పడితే సంతోషం. కానీ నిర్దోషి ఏళ్ల తరబడి జైలులో మగ్గిపోతే.. అతడి పరిస్థితి ఏంటి.. అన్నేళ్ల జీవితాన్ని వెనక్కి తీసుకువచ్చేది ఎవరు.. సమాజంలో అతడు పొందిన అవమానాలను తీర్చే వారు ఎవరు.. ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి. ఇదే పరిస్థితి ఎదరుయ్యింది తాజాగా ఓ వ్యక్తికి. చేయని నేరానికి అతడు ఏకంగా 28 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా కోర్టు అతడిని నిర్దోషి అని తేల్చింది. ఆ తీర్పు విన్న అతడు కోర్టు ఆవరణలోనే ఏడ్చాడు. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యూపీ, దేవరియా జిల్లా తాండ్వా గ్రామానికి చెందిన బీర్బల్ భగత్ అనే వ్యక్తి.. బిహార్లోని గోపాల్ గంజ్ జిల్లా హరిహరపూర్కు చెందిన సూర్యనారాయణలు స్నేహితులు. 1993 జూన్ 11న సూర్యనారాయణను కలిసేందుకు వెళ్లాడు బీర్బల్. అదే రోజు ఇద్దరూ ముజఫర్ పూర్కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి సూర్యనారాయణ కనిపించకుండా పోయాడు. దీంతో 1993, జూన్ 18న సూర్యనారాయణ కనిపించటంలేదు అని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేసిన వారు.. సూర్యనారాయణ స్నేహితుడు అయిన బీర్బల్పై అనుమానం వ్యక్తం చేస్తూ అతనే సూర్యనారాయణని కిడ్నాప్ చేసి చంపేశాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇది కూడా చదవండి: యాచకురాలి గొప్ప మనసు.. దేవుడికి లక్షరూపాయలు విరాళం
ఈక్రమంలో కొన్ని రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది పోలీసులకు. ఆ మృతదేహం గురించి ఎవరూ రాకపోవడంతో మూడు రోజుల తర్వాత ఖననం చేశారు. ఈక్రమంలో పోలీసులు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా అది సూర్యనారాయణ మృతదేహమేనని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. కొన్ని నెలలకు బీర్బల్ను అరెస్ట్ చేశారు. 28 సంవత్సరాల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పట్నుంచి కోర్టులో కేసు కొనసాగుతునే ఉంది. బీర్బల్ రిమాండ్లోనే ఉన్నాడు.
ఇది కూడా చదవండి: JCBతో ATM మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు!
గురువారం మరోసారి గోపాల్ గంజ్ జిల్లా కోర్టులో జడ్జి విశ్వభూతి గుప్తా ముందుక ఈ కేసు విచారణకు వచ్చింది. నిందితుడిపై పోలీసులు ఎలాంటి చార్జిషీటు నమోదు చేయలేకపోయారని, కేసుకు సరైన ఆధారాలూ లేవని, మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్, విచారణాధికారి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొంటు కేసును కొట్టేశారు. బీర్బల్ ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు.
వాస్తవానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ మొదలైనా.. చాన్నాళ్ల పాటు అది మూత పడిందని, దీంతో ఇప్పుడు జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని డిఫెన్స్ లాయర్ రాఘవేంద్ర సిన్హా చెప్పారు. బీర్బల్ కు బెయిల్ ఇప్పించటానికి కూడా అతని కుటుంబం యత్నించలేదని అన్నారు. మరోవైపు బీర్బల్ జైలులో ఉన్న సమయంలోనే అతడి తల్లి, తండ్రి చనిపోయారు.
ఇది కూడా చదవండి: హద్దులు మీరి బైకుపై ప్రేమజంట ముద్దులు! ప్రియుడు అరెస్టు..!
అయినవారిని కోల్పోయి.. తన జీవితంలో అమూల్యమైన 28 ఏళ్ల కాలాన్ని కోల్పోయిన ఆ అమాయకుడు న్యాయమూర్తి ‘నువ్వు నిర్దోషి’వి అని చెప్పటంతో భోరున ఏడ్చాశాడు. ప్రస్తుతం బీర్బల్ వయసు 56 ఏళ్లు. ఆ తరువాత మాట్లాడుతూ.. ‘ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. చెయ్యని నేరానికి 28 ఏళ్లు జైలు శిక్ష అనుభవించా. నేను నిర్దోషిగా విడుదలవుతానన్న ఆశను వదిలేసుకున్నా. ఇన్నేళ్లు చాలా కష్టంగా గడిచాయి’’ అని బీర్బల్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి అతడికి సమాధానం చెప్పేవారేవరు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.