సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు ఛేదించారు. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాక.. జులై 12న మోదీ, బీహార్ లో పర్యనటించనున్న నేపథ్యంలో ఆయన్ను హత్యమార్చేదుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12న మోదీ, బీహార్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి పీఎఫ్ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్లో శిక్షణ పొందారని పోలీసుల దర్యాప్తులో తేలింది. జూలై 6,7 తేదీల్లో మోదీ టార్గెట్గా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరోకు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు, కేంద్ర సంస్థల అధికారులు జులై 11 వతేదీన నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు పలు నేరారోపణ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒక దాంట్లో ‘2047 వరకు ఇండియాను ఇస్లామిక్ ఇండియాగా మార్చాలి’ అని ఉంది. వీటితోపాటు 25 పీఎఫ్ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాక.. కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులు ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని పోలీసులు వెల్లడించారు.అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి దేశంలో ఉంటూ దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చదవండి: Nagpur: కళ్ల ముందే నీటి పాలైన జీవితాలు.. చూడ్డం తప్ప కాపాడలేని పరిస్థితి!
ఇది కూడా చదవండి: Godavari River: అర్ధరాత్రి నుండి వరద నీటిలో రైతులు..! రంగంలోకి హెలికాఫ్టర్!