కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ షో గురించి తెలియని వారు ఉండరు. హిందీలో ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికే 13 సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 14 నడుస్తోంది. ఈ షో ద్వారా ఇప్పటికే అనేక మంది సామాన్యులు లక్షల్లో డబ్బులు గెల్చుకోవడంతో పాటు మంచి గుర్తింపు సంపాదించారు. తాజాగా చిన్న పాన్ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే సామాన్యుడు కేబీసీలో రూ.12.50 లక్షల డబ్బులు గెలుచుకున్నాడు. అంతేకాక ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచాడు. రోజు వారి కూలీతో జీవించే తాను ఇంత పెద్ద మొత్తం సంపాదిస్తానని కల్లో కూడా ఉహించలేదని, తన జీవితంలో ఇది మరచిపోలేని రోజు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ద్వారకాజిత్ అనే ఓ వ్యక్తి పాన్ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ పాన్ దుకాణంపైనే వారి కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. అయితే తనకు చదువుపై ఆసక్తితో కేబీసీ సీజన్-14కి ద్వారకాజిత్ ఎంపికయ్యారు. గురువారం ఫాస్టెట్స్ ఫింగర్ ఫస్ట్ లో ఇచ్చిన ప్రశ్నలకు అందరి కంటే ముందుగా సమాధానాలు చెప్పి..హాట్ సీట్ లో కూర్చుకున్నాడు. పోటీదారుడిగా గేమ్ లోకి అతడిని బిగ్ బి అమితాబ్ హాట్ సీట్ లోకి ఆహ్వానించారు. మొదటగా వెయ్యి రూపాయల ప్రశ్న సంధించే ముందు..తన కుటుంబ పరిస్థితి గురించి ద్వారకాజిత్ బిగ్ బిగ్ కి తెలిపాడు. అది తన ఐదు రోజుల ఆదాయమని ద్వారకాజిత్ చెప్పాడు. ఈ వెయ్యి రూపాయలు అన్నవి తనకు చాలా పెద్ద మొత్తమని, ఒకసారి తన భార్యకు వెయ్యి రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవాలని చెప్పానని తెలిపారు. ఆమె కుటుంబానికి కావాల్సినవన్నీ కొనుగోలు చేసిందని, తనకోసం మాత్రం ఏమీ తీసుకోలేదని ద్వారకాజిత్ అమితాబ్ తో అన్నారు.
అలానే ద్వారకాజిత్ పదివేల రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పి.. ఆ మొత్తాన్ని గెలుచుకున్నారు. ఆ సందర్భాంలో ఎంతో సంతోష పడ్డాడు. ఐదు నిమిషాల్లో 50 రోజుల ఆదాయం గెలుచుకున్నావు. అదే ఈ ఆటలో ఉండే మ్యాజిక్ అని అమితాబ్ అన్నారు. ఈ డబ్బులతో ఏం చేస్తావని అడ్డగా.. తన భార్యకు చదువుకోవాలని బాగా ఆసక్తి ఉందని, ఆమె చదువు కోసం ఉపయోగిస్తానని తెలిపాడు. ఈక్రమంలో పదివేల ప్రశ్న తరువాత కూడా పలు ప్రశ్నలు సమాధానం ఇస్తూ ముందుకెళ్లారు. చివరకి ద్వారకాజిత్ రూ.12.5 లక్షలు గెల్చుకుని ఆట నుంచి నిష్క్రమించాడు. అయితే పాన్ డబ్బా నడుపుకునే ఓ సాధారణ వ్యక్తి రూ.12.50 లక్షలు గెల్చుకోవడం బిగ్ బి ని మరింత సంతోషానికి గురిచేసింది.