కుటుంబ తగాదాలు విచక్షణ కోల్పోయేలా చేశాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలే పెద్దవిగా మారి ఆవేశాన్ని పెంచాయి. పూరన్ జైస్వాల్, అంకిత జైస్వాల్ లకు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. అంకితకు భర్తతో, అత్తింటి వారితో కలిసి ఉండడం ఇష్టం లేదు. దాంతో అందరినీ చంపాలను కుంది. భర్త ఇంట్లో లేనప్పుడు విషం కలిపిన టీని అందరికి ఇచ్చింది. దాంతో టీ తాగిన అంకిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు సృష్టి లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లై ఏడాది కూడా గడవక ముందే అత్తింటి కుటుంబంపై కక్ష పెంచుకున్న ఓ కోడలు వారి చంపాలని ప్లాన్ వేసింది. భర్త ఇంట్లో లేని సమయంలో మిగతా కుటుంబ సభ్యులకు టీ లో విషం కలిపి ఇచ్చింది. అంకిత వదిన శివాని కుమారుడు రుద్రాన్ష్ మాత్రం మృతిచెందాడు. బహ్రాయిచ్ అదనపు ఎస్పీ కున్వార్ జ్ఞానాంజయ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి అంకితను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
వివాహేతరం సంబంధం కూడా ఇందుకు కారణమాని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.