దేశంలో కరోనా కొత్త రకం వైరల్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం వారి రాష్ట్రంలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించగా.. ఇప్పుడు అస్సొం రాష్టం కూడా రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలో రెండో రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించినట్లయింది.
అలాగే 2022 ఏడాది ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి జరిగే న్యూఇయర్ వేడుకలకు మాత్రం ఈ నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. వేడుకలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజు పెరిగిపోతున్నాయి.. అందులోనూ ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మరిన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. మరి నైట్ కర్ఫ్యూ విధించి.. న్యూఇయర్ వేడుకలు మాత్రం అస్సొం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.