పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంత ప్రజలు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో పాకిస్థాన్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. త్వరలోనే శ్రీలంకలో ఎదురైన పరిస్థితులు పాక్లోనూ ఎదురవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్థాన్లో ఉండటం తమ వల్ల కాదంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో తమను కలిపేయాల్సిందిగా పాకిస్థాన్ ప్రభుత్వానికి వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్గిల్ రోడ్డును తెరిచి ఇండియాలోని లడఖ్లో ఉన్న తమ తోటివారితో కలిపేయాలని పీవోకే ప్రజలు డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున రోడ్డ పైకి వచ్చిన ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత 12 రోజులుగా ఈ నిరసనలు సాగుతున్నాయి. ఆహార కొరతతోపాటు పీవోకేలో అక్రమ ఆక్రమణలు, అక్కడి సహజ వనరుల మీద జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు రహదారుల పైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. మరి, దీనిపై పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇకపోతే, దాయాది దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. అక్కడ రోజురోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతుండటంతో పాక్ దివాళా తీసే దిశగా ప్రయాణిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అక్కడ తినడానికి తిండి లేక సబ్సిడీలో దొరికే గోధుమ పిండి కోసం వేలాది మంది ప్రజలు గంటల కొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్తోపాటు బలూచిస్థాన్ లాంటి నగరాల్లో తొక్కిసలాట జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆకాశన్నంటుతున్న ధరలు
భద్రతా దళాల పహారాలో పిండిని పంపిణీ చేస్తున్నప్పటికీ తొక్కిసలాటలు జరుగుతున్నాయని.. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందారని సమాచారం. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో గోధుమలు, పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో పిండికి రూ.150కి పైగా చెల్లించాల్సి వస్తోంది. పాక్ చరిత్రలోనే ధరలు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. మరి, భారత్లో తమను కలిపేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న నినాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Every day this week, thousands of people gathered in sub-zero temperatures in Gilgit-Baltistan to protest land-grabbing, heavy taxes, and coercion by Pakistan’s military. The region is located in Pakistan-occupied Kashmir. Take a look:pic.twitter.com/n01qZO2VkT
— Steve Hanke (@steve_hanke) January 4, 2023
Ppl in #GilgitBaltistan chant slogans for REUNIFICATION with #Ladakh & demand opening of #Kargil – #Skardu road. Ppl always resisted #Pakistani moves to make #POJK a province of #Pakistan, but #India has always accommodated Pakistan on #JammuAndKashmir ignoring public sentiments. pic.twitter.com/a5x66Qf1nx
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 7, 2023