గురువుని మించిన దైవం లేరంటారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరహ అంటారు. అంటే కనిపించని దేవుడికన్నా.. కనిపించే గురువే ఎంతో గొప్ప అంటారు. కానీ, కొందరు గురువులు మాత్రం అలాంటి గౌరవ ప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. తాము చేసే పనులతో విద్యార్థులను సైతం ఎందుకూ పనికి రాని వారిగా చేస్తున్నారు. ఆ కోవకు చెందిన ఓ టీచరమ్మ చక్కగా తరగతి గదిలోనే నిద్రకు ఉపక్రమించింది. అంతేకాదు.. క్లాస్ లోని విద్యార్థినితో విసినికర్రతో విసిరించుకుంటూ నిద్రపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచరమ్మ పాఠాలు చెప్పకుండా కుర్చీలోనే చక్కగా నిద్రలోకి జారుకుంది. అంతేకాదు.. ఆమె సౌకర్యవంతంగా నిద్రపోయేందుకు ఓ విద్యార్థినికి విసినికర్ర ఇచ్చి మరీ విసిరించుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క స్కూల్ మాత్రమే కాదు.. బిహార్ లో దాదాపు అన్నీ స్కూల్స్ ఇలాగే ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Watch: Bihar teacher sleeps in classroom as student fans her#Bihar #Teacher #ViralVideo pic.twitter.com/6PP2HpvDPk
— TIMES NOW (@TimesNow) June 7, 2022