ప్రపంచ వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కరోనా విలయ తాండవం చేస్తుండడంతో పూర్తిగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కేసులు తగ్గుముఖం పడుతూ, మళ్లీ పెరుగుతున్నాయి. అలా తగ్గుతున్న క్రమంలో స్కూల్స్, ఇతర విద్యా సంస్థలను తెరిచేందుకు అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు తెరుకోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. ఇలా కరోనా పుణ్యమా అని భారీగా సెలవులు రావడంతో పిల్లలు బడి, చదువు అనే మాటే మరిచిపోయారు.
ఈ దెబ్బతో ఇంకొందరు పిల్లలు ఏకంగా పాఠశాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇదిలా ఉంటే ఒడిశాలోని బర్గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ అనే స్టూడెంట్ 11వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దేశాల్లోని అక్కడక్కడ ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండడంతో మళ్లీ లాక్ డౌన్ పెడతారేమోనని కామగాన్ హయ్యర్ అనే విద్యార్థి ఆశపడ్డాడు. దీంతో ఎలాంటి లాక్ డౌన్ పెట్టడం లేదని ప్రభుత్వాలు తేల్చడంతో ఆ విద్యార్థి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇక ఏం చేయాలో తెలియక తికమకలో పడ్డాడు. వెంటనే తన కోపాన్ని ఆపుకోలేని ఆ విద్యార్థి ఎలాగైన తన కోపాన్ని తగ్గించుకోవాలని భావించాడు.
స్కూల్ లో ఉన్న తోటి 20 మంది విద్యార్థులపై పగ తీర్చుకోవాలని బాటిల్ నీళ్లలో విషం కలిపాడు. ఈ నీటిని తాగిన 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏంటని ఆరా తీస్తే బాటిల్ లో విషం కలిపినట్లు తేలింది. ఎవరు కలిపారని ఉపాధ్యాయులు నిలదీయటంతో నేనే కలిపానని స్టూడెంట్ కామగాన్ హయ్యర్ తెలిపాడు. దీంతో మనోడి సమాధానికి అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే ఆ విద్యార్థిని అరెస్ట్ చేయాలంటూ తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించగా ఒమిక్రాన్ నేపథ్యంలో స్కూల్ కు సెలవులు ఇవ్వరని తెలియటంతో కోపంలో ఇలా చేశానని ఆ స్టూడెంట్ తెలిపారు. స్కూల్ కు సెలవు ఇవ్వడం లేదని నీళ్లలో విషం కలిపిన విద్యార్థి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.